Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 6:04 pm Posted by : ramakrishna

వ్యవసాయ రంగంలో శిక్షణ తరగతులు

  • సర్టిఫికెట్స్ అందుకున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఒక సంవత్సరం కాలం నుండి వ్యవసాయ రంగంపై అవగాహన శిక్షణా తరగతులు దేశి ఆధ్వర్యంలో నిర్వహించగా పరీక్షలలో ఉత్తీర్ణులైన ఫర్టిలైజర్స్ షాపు యజమానులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, జిల్లా వ్యవసాయ అధికారిణి అఫ్జల్ బేగం  లా చేతుల మీదుగా  2023- 2024బ్యాచ్ డిఏఈఎస్ఐ శిక్షణ ప్రశంసా పత్రం లను అందుకున్నారు.ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బొమ్మకంటి రవీందర్ గుప్తా, సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, చేపూరి శ్రీకర్ గుప్తా, మెండే శ్రీనివాస్ యాదవ్, రామా బిక్షపతి, గంజి వేణు, బొమ్మకంటి అశోక్ గుప్తా, పెండ్యాల సంతోష్ రెడ్డి, సాయి చరణ్, పెంజర్ల శ్రీశైలం, ఉత్తీర్ణులైన వివిధ మండలాల ఫెర్టిలైజర్ షాప్ యజమానులు పాల్గొన్నారు.