Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 March 2025, 9:56 am Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లాలో విషాదం : నీట మునిగి తల్లి, పిల్లలు మృతి

చెరువులో దుస్తులు ఉతుకడానికి వెళ్లిన తల్లి, స్నానానికి దిగిన చిన్నారులు

ఎల్లారెడ్డి మండలం వెంకటపూర్ లో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ:  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటపూర్ లో ఉగాది పండుగ వేళ తీవ్రం విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి  తల్లి, పిల్లలతో సహ నీటమునిగి మృతి చెందారు. మృతులను మౌనిక (26), మైథిలి(10), అక్షర (8),వినయ్ (7) గా గుర్తించారు. చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా చిన్నారులు స్నానానికి దిగి మునిగిపోయారు.వారిని కాపాడే క్రమంలో ముగ్గురు చెరువులో మునిగి చనిపోయారు. భారీ గుంతలో చిన్నారులు పడటంతో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.