Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 August 2025, 3:06 pm Posted by : ramakrishna

జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి జాతీయ రహదారి 44 పై రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి వద్ద జాతీయ రహదారిపై భారీగా వర్షం నీరు చేరింది. దానితో నేషనల్ హైవే చెరువును తలపిస్తున్నది. వాహనాలు వరదలో కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో వాహనాలను పోలీసులు నిలిపివేశారు.

Traffic halted on national highway

బుధవారం తెల్లవారు జాము నుంచి భారీగా వర్షం కురుస్తుండడంతో మెదక్, కామారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.  కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ధ సైతం నేషనల్ హైవే మీదుగా వరధ పోంగిప్రవహిస్తుంది. దానితో దాదాపు 25 కిలో మీటర్ల మేరకు భారీ వర్షాలు , వరదల ప్రభావం ఉండటంతో హైదరాబాద్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు బంద్ అయ్యాయి.