గాంధారి, బతుకమ్మ : ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గాంధారిమండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలం పేట్ సంఘం నుంచి చద్మాల్ తండాలో గల గుడికి కందూరు చేసుకోవడానికి ఓ కుటుంబ సభ్యులు ట్రాక్టర్పై వెళ్తున్నారు. ఈక్రమంలో నేరేల్ తండా వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గణేష్ (తండ్రి రావ్ సింగ్) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
