టీఎన్జీవో బోనాల మహోత్సవానికి టీపీసీసీ అధ్యక్షుడికి ఆహ్వానం

  హైదరాబాద్, బతుకమ్మ :   టీఎన్జీవో ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీన నిర్వహించనున్న టీఎన్జీవో బోనాల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని టీఎన్జీవో ప్రతినిధులు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆహ్వానించారు. ఈ మేరకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదరాబాద్‌లో మహేష్ కుమార్ గౌడ్‌ను టీఎన్జీవో ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం జిల్లా ఉద్యోగుల సమస్యలపై ఆయనతో చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్...