నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పోచంపాడు ప్రాజెక్టులో నీట మునిగి మృతి చెందిన కలీం, అజీమ్, వజహత్ కుటుంబాలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇర్ఫాన్ అలీ, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, తాహేర్ బిన్ అహ్మదాన్, కేశ వేణు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
