మోస్రా రామాలయంలో టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు

మోస్రా, బతుకమ్మ : మోస్రా రామాలయం దేవస్థానాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వేదోచ్చారణల నడుమ ఘన స్వాగతం పలికారు.  అనంతరం మహేష్ కుమార్ గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శాంతి, అభ్యుదయం కలగాలని ప్రార్థించారు.