గ్రంథాలయాన్ని సందర్శించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టణంలో గ్రంథాలయ నూతన భవనం,జిల్లా న్యాయస్థానానికి సంబంధించిన భవనాల  కోసం ఓల్డ్ ( పాత) డిఈఓ కార్యాలయం సమీపంలోని ఖాళీ  స్థలాన్ని  గ్రంథాలయ చైర్మెన్ అంతిరెడ్డి రాజిరెడ్డితో కలిసి టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం పరిశీలించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి గ్రంథాలయాన్ని సందర్శించి యువతీ యువకులతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 65 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు నిరుద్యోగులకు వివరించారు. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల కోసం వెలువడిన నోటిఫికేషన్ సద్వినియోగం...