Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 12:37 pm Posted by : ramakrishna

 భూ వివాధంలో ట్రాక్టర్ తో తోక్కించాడు

బోదన్,  బతుకమ్మ:

దాయదుల భూ వివాదం ఓక్కరి ప్రాణాల మీదకు తెచ్చింది.  భూ వివాధంలో ఉన్న పోలంలో సాగును అడ్డుకునేందుకు యత్నించిన వ్యక్తిపై మరో వ్యక్తి క్రేజీ విల్ ట్రాక్టర్ ను ఎక్కించారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం బోదన్ మండలం  పేగడపల్లిలో జరిగింది. బోమ్మన కాడి లింగం అనే వ్యక్తి వివాధంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ క్రేజీవీల్ తో పొలం దున్నుతున్నాడు. అక్కడికి బోమ్మన కాడి బబ్లూ అనే వ్యక్తి వచ్చి అడ్డుకున్నాడు. ట్రాక్టర్ కదలకుండా అడ్డుకోవడంతో అతని పైనుంచి ట్రాక్టర్ ను తోలాడు లింగం. ఈ ఘటనలో బబ్లూ తీవ్రంగా గాయపడగా అతడిని 108 అంబులేన్స్ లో ఆసుపత్రికి తరలించారు. బబ్లూ పరిస్థితి విషమంగా ఉందని బోదన్ రూరల్ పోలిసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

 

Towed with a tractor in a land dispute