రామయ్యకు పర్యాటక శోభ

మెండోరా, బతుకమ్మ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది. పర్యాటకులు వారి చరవాణిలో ప్రాజెక్టు అందాలను, జల దృశ్యాలను, ప్రకృతి అందాలను, గోదావరి ప్రకృతి పరవాళ్లను బంధించారు. పర్యాటకులు ప్రాజెక్టుపై గుర్రాలని ఎక్కి సాగర తీరంలో సంతోషంగా స్వారీ చేసిన ఆనందాన్ని పొందుతున్నారు.