Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 9:24 pm Posted by : ramakrishna

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడానికే

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘‘తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక  రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది’’ అని ఎక్స్ వేదికగా స్పందించారు.