హనుమాన్ పెద్ద జయంతికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు
. . . అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలి . . . జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల్, బతుకమ్మ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా 950 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కొండగట్టు జేఎన్టీయూ కళాశాలలో ఆదివారం నిర్వహించిన బ్రీఫింగ్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తును 6 సెక్టార్లుగా...