. . . నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
ఆర్మూర్, బతుకమ్మ :
రంజాన్ ప్రత్యేక ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఈద్గా ప్రాంతాల్లో ముస్లిం సోదరుల సామూహికంగా ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఆర్మూర్ లోని అంకాపూర్ వద్ద ఈద్గా ప్రాంతాన్ని సీపీ సందర్శించారు.

ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై నిర్వహుకులతో పాటు అధికారులతో చర్చించారు. ముస్లిం సోదరులు రంజాన్ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్స్ పెక్టర్ లు పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
