బాసర త్రిబుల్ ఐటీ కి ముగ్గురు విద్యార్థులు ఎంపిక

  లింగంపేట, బతుకమ్మ   లింగంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి ఉన్నత మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు బాసరలోని త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు లింగంపేట్ మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.     లింగంపేట్ మండలంలోని భవానిపేట గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన దీపిక యాదవ్, లింగంపేట బాలికల ఉన్నత పాఠశాలలో చదివిన శృతి, బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన లక్ష్మణ్ యాదవ్ బాసరలోని త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు ఆయన తెలిపారు.