Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2025, 9:26 am Posted by : ramakrishna

ఒకే సమయంలో మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురి దుర్మరణం

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలో ఘటన

ఒంగోలు, బతుకమ్మ :  ఒకే సమయంలో (దాదాపుగా) జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. బోల్తాపడిన లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. ఈప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈట్రాఫిక్ లో ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా కాగా, అందులో ప్రయాణిస్తున్న పావని (25), కౌశిక్ (14) మృతి చెందారు. వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళ్తున్నట్లుగా గుర్తించారు.