Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 5:58 pm Posted by : ramakrishna

పోలీసుల పై దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం పోలీసు సిబ్బంది పై దురుసుగా ప్రవర్తించి, ఏఎస్ఐ రేణుకా దేవి విధులకు ఆటంకం కలిగించి, దుర్భాషలాడిన ముగ్గురు వ్యక్తులకు ఏఎస్సై రేణుకా దేవి ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్సై మనోజ్ కుమార్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు గౌరవ అడిషనల్ జడ్జి ఇ. సాయిశివ ముగ్గురు వ్యక్తులకు ఆరు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. మండలంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించిన, పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్చలు తీసుకుంటామని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.