పోక్సో కేసులో ముగ్గరి అరెస్ట్
నిందితుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు భిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో పోక్సో కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఉన్నారు. కామారెడ్డి జిల్లా కోర్టులో ముగ్గరు నిందితులను శుక్రవారం ప్రవేశ పెట్టగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మండల పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పాఠశాల ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ రాజీ...