Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 8:21 pm Posted by : ramakrishna

హత్య కేసులో ముగ్గురి అరెస్టు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలో జరిగిన హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.తిరుపతి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని గంజ్ గోశాల రోడ్డు ఈనెల 15న రాత్రి 8 గంటలకు గురుకృప పాన్ షాప్ వద్ద జరిగిన గలాటా లో మృతి చెందిన గైక్వాడ్ చంద్రకాంత్ మరణానికి కారణమైన వంటి వ్యక్తులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ కాలనికి చెందిన మనీష్ కుమార్, వినాయక్ నగర్ కు చెందిన చిట్లు సాయికృష్ణ,  రసగొని రుతిక్ లను బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.