నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచడం, బెట్టింగ్ సెంటర్లుగా మారిన గేమింట్ సెంటర్లపై ఈనెల 3వ తేదీన ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచిన సవేరా, మిలన్ హోటళ్ల యజమానులతోపాటు స్నూకర్ పాయింట్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఒక్కొక్కరికి మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది.