ఎర్రకోటలో దొంగలు.. బంగారు కలశాలు మాయం
ఢిల్లీ, బతుకమ్మ : ఢిల్లీ ఎర్రకోటలో దొంగతనం జరిగింది. ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.కోటి విలువగల రెండు కలశాలు చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 3న ఆధ్యాత్మిక కార్యక్రమం జరగగా పూజకోసం వాడిన 760గ్రా బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రా కలశం కనిపించలేదని సుధీర్ కుమార్ జైన్ ఫిర్యాదు చేశారు.