Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:21 pm Posted by : ramakrishna

దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

దేశ వ్యతిరేక శక్తులు దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, బీజేపీ కార్యకర్తలు నిరసన కొనసాగించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులను ఆమోదించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. నీట్ పరీక్షల అంశాన్ని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ, ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, వాటికి నీట్ పరీక్షలతో ఎలాంటి సంబంధం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశం కొత్త దిశగా ముందుకు సాగుతోందని, ఇలాంటి కుట్రలకు బీజేపీ భయపడదని నీలం చిన్న రాజులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ఫలించవని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరింత పరిణితితో వ్యవహరించాలని సూచిస్తూ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

They are trying to create unrest in the country.