ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది

బతుకమ్మ,ముప్కల్: ప్రతి ఒక్క విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందని సరైన క్రమంలో శిక్షకుల ఆధ్వర్యంలో తర్ఫీదు ఇచ్చినట్లయితే పిల్లల్లోని సృజనాత్మక శక్తి బయటపడుతుందని పాఠశాల చైర్మన్ సాయిరెడ్డి అన్నారు. ముప్కల్ మండలం రెంజార్ల గ్రామంలోని విజ్ఞాన్ పాఠశాలలో నిర్వహించిన  సమ్మర్ క్యాంప్ లో భాగంగా పిల్లలు భరతనాట్యంలో తర్ఫీదు పొందారు. తాము నేర్చుకున్న  నృత్య ప్రదర్శనను  పిల్లలు శనివారం పాఠశాల ఆవరణలో ప్రత్యేక దుస్తులతో అలంకరించుకొని భరతనాట్యం ప్రదర్శించడం జరిగింది. తమ పిల్లలు చేసిన నాట్యం చూసిన తల్లిదండ్రులు మంత్రముగ్ధులను చేసిందని ఆయన పేర్కొన్నారు....