Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 5:37 pm Posted by : ramakrishna

పట్టించుకునేవారు కరవు

మోర్తాడ్, బతుకమ్మ: చెరువు నీరు నిత్యం పారుతుండటంతో పక్కన ఉన్న స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామ ఊర చెరువు నుంచి వెళ్తున్న కాల్వ కు పైప్ లైన్ వేసినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం పట్టించుకునే వారు లేక పక్కన గండి ఏర్పడి నీరు పైపుల్లో నుంచి కాకుండా పక్కకు వెళ్లి పోతుందని స్థానికులు పేర్కొన్నారు. ఇండ్లలోకి విష సర్పాలు, పురుగులు వస్తున్నాయని భయం భయంతో కాలం వెళ్లగొచ్చుతున్నామని తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయించాలని కోరారు.

There is a shortage of people who care

There is a shortage of people who care