నిలిపి ఉన్న లారీల నుంచి డీజిల్ చోరీ
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపి ఉంచిన లారీల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేస్తున్నారు. గత కొంతకాలంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల నుంచి డిజల్ దొంగతనం జరుగుతూనే ఉంది. అత్యాధునిక పరికరాలతో డీజిల్ దొంగతనాలు చేస్తున్నారని దొంగల నుండి రక్షించాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు. రెండు లారీల నుండి సోమవారం ఉదయం 4 గంటలకు సమయంలో దాదాపు 500ల లీటర్లకు పైగా దొంగతనం జరిగినట్లు బాధితులు తెలిపారు.