Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 6:11 pm Posted by : ramakrishna

మహిళ మృతదేహం లభ్యం

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజేపల్లి గ్రామంలో ఆదివారం మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజేపల్లి గ్రామానికి చెందిన భూమవ్వ(70) ఈనెల 10న మతిస్థిమితం సరిగాలేక ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం ఎన్ని చోట్ల వెతికినా ఆచూకి లభించలేదు. అయితే సోమవారం ఉదయం బంజేపల్లి గ్రామ శివారులోని పెద్దబ్రిడ్జీకి వెళ్లు రోడ్డు పక్కన చనిపోయి కనిపించింది. ఆమెకు మతిస్థిమితం లేక కాలకృత్యలకని వెళ్లి ప్రమాద వశత్తున చనిపోయిందని ఆమె మృతి లో ఎలాంటి అనుమానం లేదని తన కొడుకు సాయిలు దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.