కిటీకీ గ్రిల్ తొలగించి చోరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని వినాయక్ నగరంలో దుండగులు ఆదివారం రాత్రి రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. వృద్ధ దంపతులు నిద్రిస్తుండగా ఇంటి కిటికీ గ్రిల్ ను తొలగించిన దుండగులు లోనికి ప్రవేశించి రూ.2.50లక్షల నగదు, 30 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే మరో ఇంట్లో నుంచి పెద్ద మొత్తంలో సొత్తును ఎత్తుకెళ్లారు.