నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సైన్స్ కళాశాల బిల్డింగును వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు రిజిస్టర్ ఆచార్య యాదగిరి తో కలిసి శుక్రవారం సందర్శించారు. నిర్మాణంలో నాణ్యమైన వస్తువులను వాడాలనిసూచించారు. ల్యాబ్ లకు తరగతి గదులకు అనుగుణంగా నిర్మాణాలు చేయాలని ఆదేశించారు. అనంతరం న్యాయ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు.
హెల్త్ సెంటర్ ను సందర్శించిన వీసి..
హెల్త్ సెంటర్ ను సందర్శించి హెల్త్ సెంటర్ లోని పరికరాలను, మెడిసిన్స్ టాబ్లెట్,టానిక్ సిరప్ లను పరిశీలించినారు.అనంతరం డాక్టర్ గారితో మాట్లాడుతూ నాణ్యమైన మందులు అందించాలన్నారు.

బాలికల వసతి గృహాన్ని సందర్శించిన వీసీ..
బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసి బాలికలకు రుచికరమైన, రుచికరమైన, నాణ్యమైన భోజనము సమయానికి అందించాలని హాస్టల్లో ఉండే బాలికలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని హాస్టల్ చుట్టుపక్కల పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రత పాటించాడానికి చర్యలు తీసుకోవాలని వార్డెన్ డాక్టర్ కిరణ్మయి ని, చీఫ్ వార్డెన్ ఐలేని మహేందర్ ను ఆదేశించారు.
