Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 5:14 pm Posted by : ramakrishna

భారత జవాన్ల పరాక్రమం ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : “కార్గిల్ విజయ్ దివస్,,” సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాల గల కార్గిల్ అమరవీరుల  స్థూపానికి న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ 1999 జమ్మూ కాశ్మీర్ లడక్ కార్గిల్ జిల్లా పర్వతప్రాంతన్నీ పాకిస్తాన్ సైన్యం  ఆక్రమించడాని  భారత సైనిక జవాన్లు ధైర్య సాహసలతో సమర్థవంతంగా కార్గిల్ యుద్ధంలో జవాన్లు ప్రాణ త్యాగం చేసి విజయం సాధించడం  జరిగిందని మాతృభూమి కోసం   భారత వీర జవాన్లు పరాక్రమం ధైర్యానికి దేశభక్తికి ప్రతీక అని నేటి యువత జవాన్ల దేశభక్తి ధైర్య సాహసం ఆదర్శంగా నడవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్కుమార్, సుబేదార్ మాణిక్ రాజు, వెంకటరమణ గౌడ్, చిన్న నాయక్, చుక్కాపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.