. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి
. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ: పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారని, ఎవరు చనిపోయినా దేశ పౌరులేనని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని పార్టీలతో మాట్లాడాలని కోరారు. కాల్పులతో మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం విధానం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు జరపాలని, పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3,500 మంది నక్సలైట్లు సరెండర్ అయిన విషయాన్ని కవిత గుర్తు చేశారు.
కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో ఛత్తీస్ గఢ్ వచి వచ్చి కూడా తెలంగాణలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని అన్నారు. కేసీఆర్ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని కోరారు.