బైక్ పై వచ్చి డబ్బులు లాక్కెళ్లిన దుండగులు
నాగిరెడ్డిపేట, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గేట్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి చేతిలో నుంచి దుండగులు డబ్బుల సంచిని లాక్కెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కంపల్లికి చెందిన జక్కుల రాములు నాగిరెడ్డిపేటలోని యూనియన్ బ్యాంక్ లో మంగళవారం రూ.80వేల డ్రా చేశాడు. అనంతరం తాండూర్ గేట్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు రాములు చేతిలో నుంచి డబ్బుల సంచిని లాక్కెళ్లారు. బాధితుడు జక్కుల రాములు