Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 4:14 pm Posted by : ramakrishna

బైక్ పై వచ్చి డబ్బులు లాక్కెళ్లిన దుండగులు

నాగిరెడ్డిపేట, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గేట్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి చేతిలో నుంచి దుండగులు డబ్బుల సంచిని లాక్కెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కంపల్లికి చెందిన జక్కుల రాములు నాగిరెడ్డిపేటలోని యూనియన్ బ్యాంక్ లో మంగళవారం రూ.80వేల డ్రా చేశాడు. అనంతరం తాండూర్ గేట్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు రాములు చేతిలో నుంచి డబ్బుల సంచిని లాక్కెళ్లారు.


The thugs came on a bike and stole the money

బాధితుడు జక్కుల రాములు