Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2025, 1:01 pm Posted by : ramakrishna

త్రివిధ దళాలు శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయి : మోదీ

పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టాయి

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించామని ప్రధాని మోదీ అన్నారు. త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కరిబిక్కిరి చేశాయన్నారు. 18 రాష్ర్టాల్లో ఆధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి మాట్లాడారు. మన మహిళల సిందూరం చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేశామన్నారు. పహల్గాం ఘటనకు 23 నిముషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు.  ఇకపై ఉగ్రవాదులకు ఇలాంటి సమాధానమే ఉంటుందని మోదీ హెచ్చరించారు. మన సాయుధ దళాలు పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టాయని పేర్కొన్నారు.