నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహాత్మా గాంధీ 155 వ జయంతిని పురస్కరించుకుని నటరాజు నృత్య నికేతన్ ఆధ్వర్యంలో హైదారాబాద్ నిర్వహించిన నాట్య ప్రదర్శనలో నిజామాబాద్ అంజలి సిస్టర్స్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థినిలు ప్రతిభ చాటారు. జిల్లాకు చెందిన సుమారు 15 మంది నాట్య కళా కారిణీలు హైదారాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్ లో నృత్య ప్రదర్శన లో పాల్గొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని.. ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 155 మంది కళాకారులు ఒకేసారి నృత్య ప్రదర్శన నిర్వహించగా.. మాస్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన చిన్నారులు ఉత్తమ ప్రతిభ కనబరచి మెడల్ సాధించారు.
