Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 5:30 pm Posted by : ramakrishna

తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలి

  • మెప్మా పీడీ జి.రాజేందర్

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణ సర్వేను ఎన్యూమాలేటర్లు తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. రాజేందర్ సూచించారు.మంగళవారం ఆయన భీంగల్ పట్టణంలో వివిధ వార్డులలో చేపట్టిన సర్వే తీరును పరిశీలించారు. సర్వే సూపర్వైజర్లను మరియు ఎన్యుమర్లెటర్లు అడిగి వివరాలను తెలుసుకున్నారు. తప్పనిసరిగా ఎన్యుమర్లెటర్లు సర్వేను తొందరగా పూర్తి చేయాలన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వై రామకృష్ణ. మేనేజర్ నరేందర్. సూపర్వైజర్లు. మెప్మా ఆర్పీలు వార్డ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.