అన్ని రకాల పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

  . . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రైతులు పండించిన అన్ని రకాల పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ లోని ఎన్‌ఆర్ భవన్‌లో ఏఐకేఎంఎస్ నిజామాబాద్ డివిజన్ కమిటీ పరిధిలోని కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం...