Date of Publish : 03 October 2024, 5:16 pmPosted by : ramakrishna
ఏసీపీ నుంచి అనుమతి తీసుకుని సౌండ్ సిస్టం కిరాయికి ఇవ్వాలి
నిజామాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు డీజేలు నిషేదిస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలోని అంబేద్కర్ భవన్ లో సౌండ్ సిస్టం యజమానులకు, దుకాణదారులకు గురువారం పోలీసుల ఆధ్వర్యంలో కౌన్సి లింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సౌండ్ సిస్టం వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై వివరించారు. ఇక ముందు డీజేలు కలిగి ఉండాలంటే పోలీస్ కమిషనర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఫంక్షన్లకు సౌండ్ సిస్టం కిరాయికి ఇవ్వాలని సూచించారు. అనుమతి తీసుకోని వారిపై కేసులు నమోదు చేసి సౌండ్ సిస్టంను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఒకటో పోలీస్ స్టేషన్ అధికారి రఘుపతి, నిజామాబాద్ సర్కిల్ అధికారి శ్రీనివాస్ రాజ్, నిజామాబాద్ సౌత్ రూరల్ అధికారి సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.