నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని ( సి బి సి ఎస్ ) బి. ఎ , బీ.కాం., బీ. ఎస్సీ, బి బి ఏ, బీసీఏ కోర్సులకు ఒకటవ,మూడవ,ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ కు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన పరీక్ష కేంద్రాలలో 898 మంది విద్యార్థులకు 800 మంది విద్యార్థులు హాజరయ్యారు. 98 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 6265 మంది విద్యార్థులకు గాను 5995 హాజరయ్యారని 270 మంది విద్యార్థులు గైరాజరయ్యారుఅని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలియజేశారు.