Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 4:32 pm Posted by : ramakrishna

అమరుల త్యాగాలను పూర్తి చేసుకున్నారు

మోర్తాడ్,బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. ప్రజల తరఫున సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఢీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సీనియర్ నాయకుడు వై.సంతోష్, లడ్డు గంగాధర్, నవీద్, తాజా మాజీ సర్పంచ్ దేవన్న, తదితరులు పాల్గొన్నారు.