- బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి
బతుకమ్మ, బిచ్కుంద : భారత దేశ సమాజానికి చేయూతనిస్తూ,శాంతిభద్రతలు కాపాడుతూ, టెర్రరిస్టు లతో,మావోయిస్టులతో నిరంతరంగా పోరాడుతూ దేశం కోసం వీరమరణం పొందిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని ఎస్సై మోహన్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో పోలీసులు సోమవారం ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మోహన్ రెడ్డి తో పాటు ఏఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ అర్జున్, జీవన్, పాండురంగ, హోంగార్డ్ రాములు తదితరులు పాల్గొన్నారు.
