Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 2:06 pm Posted by : ramakrishna

దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర  కీలకం

నిజామాబాద్, బతుకమ్మ  : దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర  కీలకమని  మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే, మహాసభల ఆహ్వాన సంఘం ఛైర్మన్ పి. సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 20-22 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల సుభాష్ నగర్ లోని బోధన్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభల లోగోను  ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా  ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ  సమాజంలో జరుగుతున్న మార్పులను విద్యార్థులు గమనించాలని విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి, అన్యాయాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగేష్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పి.సుధాకర్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షుడు వర్ధపట్టు వేణు రాజ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, జిల్లా కార్యదర్శి రఘురాం,జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, జిల్లా ఉపాధ్యక్షుడు సుభొద్ పాల్గొన్నారు.