Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 1:14 pm Posted by : ramakrishna

పరిశోధన ఫలాలను అందిపుచ్చుకోవాలి

ముప్కాల్, బతుకమ్మ: వ్యవసాయరంగంలో వస్తున్నపరిశోధన ఫలాలను అందిపుచ్చుకోవాలని రైతు నాయకుడు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా మండలి సభ్యుడు కోటపాటి నర్సింహనాయుడు రైతులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ముప్కాల్ మండలం కొత్తపల్లిలో గురువారం ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోటపాటి.. అధిక దిగుబడులు వచ్చే నూతన వంగడాలు, పురుగు మందులు, రసాయ ఎరువుల వాడకంలో మెలకువలు, పంటల మార్పడి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఫిర్దోస్ సహనా,  కల్పన, ఏఈవో రుద్ర వినాయక్, హర్టికల్చర్ ఆఫీసర్ హరీశ్ కుమార్, రుద్రూర్ కృషి విజ్ఞాన్ కేంద్రం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, కే రమేశ్, ఎస్ రుక్మాజీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.