Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 7:27 pm Posted by : ramakrishna

డీసీసీ అధ్యక్ష పదవి పూర్తిగా పారదర్శకం

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్ ) ఎంపిక ప్రక్రియలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలా కి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమయిందని..పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా,  నాయకుల, కార్యకర్తల యొక్క అభిప్రాయాలను మరియు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

The post of DCC president is completely transparent