తెరుచుకున్న ఏడుపాయల ఆలయం
మెదక్, బతుకమ్మ : ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గభవాని ఆలయం దాదాపు 28 రోజుల తర్వాత గురువారం తెరుచుకుంది. మంజీర కు వరద పోటెత్తడంతో ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. గర్భాలయ సంప్రోక్షణ అనంతరం అమ్మవారి మూల విరాట్ ను మంజీర జలాలతో అభిషేకించారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు.