Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2024, 5:43 pm Posted by : ramakrishna

ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీ.. ఒకరు మృతి 

బతుకమ్మ, మాచారెడ్డి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టుకున్న  ఘటనలో  శుక్రవారం ఒకరు మృతి చెందారు.  ఈ ఘటన  మాచారెడ్డి మండలంలో ని కాకుల గుట్ట తండా  వద్ద చోటుచేసుకుంది. పోలీసుల  కథనం ప్రకారం.. మాచారెడ్డి మండలంలో ని కాకుల గుట్ట తండా కు  చెందిన బానోత్ హనుమ (58)  తన బైక్ పై మాచారెడ్డికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండ గా కాకుల గుట్ట తాండ బస్టాండ్ వద్ద  యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ముస్తాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టడంతో హనుమ తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భార్య బనావత్ లక్ష్మి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు ఎస్ఐ అనిల్ తెలిపారు.