బతుకమ్మ , బాన్సువాడ : బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు తాత్కాలికంగా మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స కోసం ఏర్పాట్లను చేశారు. అక్కడ రోజు రోజుకు పేషంట్లు ఎక్కువ రావడం మూలన ఇబ్బందులకు గురి అవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పొచారం శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రిస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ పేషంట్ల సౌలభ్యం కొరకు తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించిన మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్.ఈ కార్యక్రమంలో నాయకులు ఏజాస్ నార్ల సురేష్, కోఆప్షన్ మెంబర్ అలిమొద్దీన్ బాబా, హాకీమ్, నార్ల ఉదయ్, బోడ భాస్కర్, కోనాపూర్ గంగాధర్ తదితరులు ఉన్నారు.