ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన సత్యం టౌన్షిప్ (వెంచర్) లో ఎమ్మెల్యే మదన్ అన్న కబడ్డీ పోటీలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్వర్యంలో జరుగుతున్న కబడ్డి పోటిలను గురువారం ఎల్లారెడ్డి ఆర్డిఓ మన్నె ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు …ఈ సంద్భంగా పలువురు నాయకులు, అతిథులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలంలో కబడ్డీ పోటీలుఎమ్మెల్యే మదన్ మోహన్ అదేశాల మేరకు ఎన్నడూ లేని విధంగా కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మదనన్న కబడ్డీ పోటీలు జిల్లాస్థాయిని తలపించేలా ఉన్నాయన్నారు.ఈ మదనన్న టోర్నమెంట్ కబడ్డీ పోటీలలో ఎల్లారెడ్డి మండలంలోని 56 టీంలు పాల్గొనడం ఎంతో గొప్ప విషయం అన్నారు…. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కబడ్డీ అభిమానులు పాల్గొన్నారు.
