Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 3:46 pm Posted by : ramakrishna

మైనర్ ను వేధించిన ఎంబీటీ  నాయకుడు

. అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మైనర్ ను వేధించిన కేసులో ఎంబీటీ నగర అధ్యక్షుడు బాసీద్(50) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలపల్లికి చెందిన బాసీద్ స్థానికంగా ఉండే 15 ఏళ్ల బాలికను స్కూల్ కు, కిరాణా  దుకాణానికి వెళ్లే సమయంలో రోజూ వేధించడంతో సదరు బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాసీద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.