Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 5:30 pm Posted by : ramakrishna

మటన్ ముక్క తెచ్చిన తంటా

  • గొంతులో  ఇరుక్కొని ఒకరి మృతి

 

బతుకమ్మ కోటగిరి : ఓ ఫంక్షన్లో పెట్టిన మటన్  ఒక వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం తండా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాలు ప్రకారం నసురుల్లాబాద్ మండలం బొప్పాస్ పల్లి గ్రామానికి చెందిన  రుత్వన్ తార సింగ్ అనే వ్యక్తి తన భార్యతో కలసి ఆదివారం రోజున కోటగిరి మండలం సుద్దులం తండా గ్రామాలలో తమ బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వచ్చి బంధువులతో కలిసి విందు భోజనం చేస్తుండగా  మటన్ ముక్క గొంతులో  ఇరుక్కోవడంతో వాంతులు చేసుకొని మరణించాడని ఆయన తెలిపారు. మృతుడి భార్య  రుత్వన్ యమున బాయి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  ఆయన తెలిపారు.