Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 6:29 pm Posted by : ramakrishna

విద్యార్థినుల ఆచూకీ లభ్యం

. నిజామాబాద్ బస్టాండ్ లో ఒకరు..

. వేముల వాడలో మరో ఇద్దరి ఆచూకీ లభ్యం

నవీపేట్, బతుకమ్మ: నవీపేట మండల కేంద్రం నుంచి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం తమ ఇళ్లలో నుంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు బయల్దేరిన విద్యార్థినులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళిక సాయంత్రి తిరిగి ఇళ్లకు వెళ్లకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం నిజామాబాద్ బస్టాండ్ లో కొండపల్లి శిరీషను, మిగతా ఇద్దరు మేడం వరలక్ష్మి, గడ్డం రవళికను వేములవాడలో గుర్తించారు. నవీపేట ఎస్సై వినయ్ ఇద్దరు విద్యార్థినులను వేములవాడ నుంచి నవీపేటకు తీసుకువస్తున్నారు.