- టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్,బతుకమ్మ : సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ లిస్ట్ లు నిజం కావని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదనల పేరుతో సామాజిక మాధ్యమంలో ప్రచారం లో ఉన్న లిస్టులు నిజం కావన్నారు. అలాంటి ప్రతిపాదనలు, లిస్టులు ఇంకా టీపీసీసీ చేయలేదని తెలిపారు. డీసీసీ లు, టీపీసీసీ కార్యవర్గం ప్రతిపాదనల కోసం క్షేత్ర స్థాయి సంప్రదింపుల కోసం ఒక విధానంతో వెళ్తున్నామన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో ఉన్న లిస్టులను కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు నమ్మవద్దని సూచించారు.